యాదాద్రి పనులపై సీఎం కేసీఆర్‌ అసంతృప్తి

17 Aug, 2019 19:01 IST|Sakshi

సాక్షి, నల్గొండ : యాదాద్రి ప్రధానాలయ పనులపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించేందుకు శనివారం ఆయన యాదాద్రిలో పర్యటించారు. అనంతరం యాదాద్రి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష జరిపారు. ప్రధానాలయ పనులు ఇంకా పూర్తికాకపోవటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ఎప్పటిలోగా పూర్తిచేస్తారని, పనులు వేగవంతం చేయటానికి ఇబ్బందులేంటని అధికారులను ప్రశ్నించారు. నిర్మాణ పనులకు తక్షణం రూ.50కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరిలో మహాసుదర్శన యాగం నేపథ్యంలో పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు