గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

29 May, 2018 15:40 IST|Sakshi
గవర్నర్‌ నరసింహన్‌, కేసీఆర్‌( పాతచిత్రం)

సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్ల కోసం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం, ఢిల్లీ పర్యటన వివరాలపై గవర్నర్‌తో సీఎం కేసీఆర్ చర్చించారు. అదే విధంగా జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకలకు గవర్నర్‌ను సీఎం ఆహ్వానించారు.

మరిన్ని వార్తలు