రేపు మధ్యాహ్నం ప్రెస్ అకాడమీకి కేసీఆర్

20 Feb, 2015 12:19 IST|Sakshi

తెలంగాణ సచివాలయంలోకి మీడియా రాకుండా ఆంక్షలు విధించే అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఈ విషయం చర్చించేందుకు శనివారం మధ్యాహ్నం 2గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ అకాడమికీ వెళ్లనున్నారు. ఆయన.. అక్కడ ప్రెస్ అకాడమీ ఛైర్మన్, ఇతర జర్నలిస్టు సంఘాలతో మాట్లాడనున్నారు. సచివాలయంలో మీడియాకు ఆంక్షలు విధించే ఆలోచన చేస్తున్నట్లు తెలంగాణ సర్కార్ చెప్పడంతో నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు