టీపీఎస్సీ సిలబస్ రూపకల్పనకు కమిటీ

3 Jan, 2015 19:39 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ రూపకల్పన కోసం కమిటీని ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్ అధ్యక్షతన ఈ కమిటీలో 25 మంది నిపుణలను నియమించారు. సభ్యులుగా నాగేశ్వర్, చుక్కా రామయ్య, కోదండరాం, రమామెల్కోటె, నందిని సిద్ధారెడ్డి తదితరులున్నారు. పోటీ పరీక్షల కోసం ఈ కమిటీ సిలబస్ను రూపొందించనుంది.

మరిన్ని వార్తలు