నామినేషన్‌ వేస్తున్నారా..!

19 Mar, 2019 11:55 IST|Sakshi

లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు నామినేషన్‌వేస్తున్నారా... అయితేఈ నిబంధనలు తప్పక పాటించాల్సిందే. ఎలక్షన్‌ కమిషన్‌ సూచించిన నిబంధనల ప్రకారం ప్రతిఒక్కరూనడుచుకోవాల్సిందే. లేదంటే నామినేషన్‌ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది.

సాక్షి, సిటీబ్యూరో : లోక్‌సభ ఎన్నికల నామినేషన్లు ఈ నెల 25  స్వీకరిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరణ జరుగుతుంది. ప్రతి అభ్యర్థి నాలుగు నామినేషన్‌ సెట్లు దాఖలు చేయవచ్చు. అభ్యర్థులు రెండు నియోజక వర్గాలకు మాత్రమే నామినేషన్లు వేయవచ్చు. అంతకంటే ఎక్కువ నియోజకవర్గాలకు నామినేషన్లు వేస్తే తిరస్కరణకు గురవుతాయి. జనరల్‌ స్థానాలకు అయితే డిపాజిట్‌ రూ.25వేలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే రూ.12,500 డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.

నామినేషన్‌కు అఫిడవిట్‌ ఫారం 26 దాఖలు చేయాల్సి ఉంటుంది. వేరే నియోజకవర్గం అభ్యర్థి అయితే సర్టిఫైడ్‌ కాపీ ఆఫ్‌ ఓటర్‌ లిస్ట్‌ జిరాక్స్‌ సమర్పించాలి. నామినేషన్‌ హాల్‌కు కేవలం అభ్యర్థితో పాటు నలుగురికి మాత్రమే అవకాశం ఉంటుంది. నామినేషన్‌ వేసే అభ్యర్థి నామినేషన్‌ కేంద్రం వద్దకు మూడు వాహనాలను ఉపయోగించవచ్చు. 100 మీటర్ల దూరంలోనే వాహనాలు నిలపాలి. డీఎస్పీ నోడల్‌ ఆఫీసర్‌గా వ్యవహరించి అన్ని విషయాలను అబ్జర్వేషన్‌ చేస్తారు. రికగ్నేషన్‌ పార్టీలకు అయితే ఫారం బీసమర్పించాల్సి ఉంటుంది. అన్‌రికగ్నేషన్‌ పార్టీ అభ్యర్థి అయితే స్వతంత్ర అభ్యర్థులు అయినా 10 మందిప్రతిపాదించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు