స్పష్టత ఇవ్వాలని ఎండోమెంట్కు జీఏడీ లేఖ
సాక్షి, హైదరాబాద్ : హోలీ సెలవు దినం మార్చి ఒకటినా లేక రెండో తేదీనా అన్న దానిపై గందరగోళం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 1న హోలీ సెలవు ప్రకటించింది. కేంద్రం మాత్రం మార్చి 2న ప్రకటించింది. ఈ రెండు రోజుల్లో ఏ తేదీన సెలవు ప్రకటించాలో స్పష్టత ఇవ్వాలని సాధారణ పరిపాలన విభాగం పొలిటికల్ సెక్రటరీ అదర్సిన్హా దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శికి నోట్ రాశారు. రెండో తేదీకి సెలవు మార్చుకోవాలా? లేక ఒకటో తేదీనే సెలవు ప్రకటించాలా అన్న దానిపై అత్యవసరంగా తెలపాలని ఎండోమెంట్కు రాసిన నోట్లో స్పష్టంగా పేర్కొన్నారు.