మున్సిపల్‌ కార్మికురాలికి అభినందన

23 Mar, 2018 12:46 IST|Sakshi
లక్ష్మీ దంపతులను సన్మానిస్తున్న కాలనీవాసులు

మెట్‌పల్లి: చెత్త కుప్పలో దొరికిన రూ.1.20లక్షలను పోగొట్టుకున్న వ్యక్తికి ఇచ్చి నిజాయితీని చాటుకున్న మున్సిపల్‌ పారిశుధ్య కార్మికురాలు మద్దెల లక్ష్మిని గురువారం పలువురు అభినందించారు. మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ మర్రి ఉమారాణి, కమీషనర్‌ అయాజ్‌లు, బీసీ సంఘం నాయకులు అందె మారుతి, బొడ్ల రమేశ్‌లు సన్మానించారు. అలాగే 9వార్డులో కౌన్సిలర్‌ గైనీ లావణ్యతో పాటు స్థానికులు లక్ష్మీ దంపతులను అభినందించారు.  
 

మరిన్ని వార్తలు