కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ కాస్తా బాధల తెలంగాణగా మారిందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేటలో కాంగ్రెస్ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడిన ఆయన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికే ఫించన్లు, రేషన్కార్డులు అందుతున్నాయని ఆరోపించారు.
అభిమానంతో పార్టీ సభ్యత్వాలు తీసుకోవాలేగానీ ఇలా ప్రలోభాలకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని టీఆర్ఎస్ తీరును ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పాలనలో రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసుకున్నారని, టీఆర్ఎస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు.