మంత్రి పర్యటన.. కాంగ్రెస్ నాయకుల గృహ నిర్బంధం

30 Apr, 2015 13:25 IST|Sakshi

కరీంనగర్: పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది.

గంభీరావుపేట మండలంలో మంత్రి పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మృత్యుంజయను, ముస్తాబాద్‌లో గృహ నిర్బంధం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల అరెస్ట్‌ను నిరసిస్తూ పలువురు కార్యకర్తలు మండల కేంద్రంలో రాస్తారాకో నిర్వహించారు.

>
మరిన్ని వార్తలు