సాక్షి, వరంగల్ రూరల్: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ అభ్యర్థులను బరిలో నిలిపేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తును ప్రారంభించింది. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే వారి నుంచి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి దరఖాస్తులు స్వీకరించారు. ఈ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 21తో ముగిసింది. ఆ దరఖాస్తులను టీపీసీసీ కార్యాలయంలో నాయిని అప్పగించారు.
వర్ధన్నపేట నుంచి అధికంగా..
జిల్లాలో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి 21 మంది ఆశావహులు టికెట్ కోసం దరఖాస్తు చేశారు. నర్సంపేట నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కత్తి వెంకటస్వామి సైతం దరఖాస్తు చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ కోసం సిరిసిల్ల రాజయ్య దరఖాస్తు చేశారు.
దరఖాస్తుదారుల వివరాలు
నియోజకవర్గాల వారీగా..
ప్రజాబలమే ప్రాతిపదిక..
కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ సారి టికెట్ కేటాయింపులపై ఆచితూచి అడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందుకే టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలతో కలిసి మహాకూటమిగా ఏర్పడేందుకు మంతనాలు చేస్తున్నారు. పొత్తులు ఖరారయ్యాక టికెట్ల కేటా యింపు జరగనుంది. నియోజకవర్గాల్లో కుల సమీకరణలు, ప్రజాబలాలను ప్రాతిపదికనే నేతలకు టికెట్లు కేటాయించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్వేలు సైతం చేయించి టికె ట్ కేటాయిస్తారన్న చర్చ సాగుతోంది. దాదాపు ప్రతి నియోజకవర్గంలో రెండు సార్లు సర్వే నిర్వహించి ఎవరు బలమైన అభ్యర్థి అయితే వారికి టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయి. పొత్తులు పూర్తి కాగానే కాంగ్రెస్కు కేటాయించే స్థానాల అభ్యర్థులను ప్రకటించనున్నారు.