'వారిద్దరిపై సీబీఐతో విచారణ చేయించాలి'

10 Jun, 2015 14:50 IST|Sakshi
'వారిద్దరిపై సీబీఐతో విచారణ చేయించాలి'

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్, చంద్రబాబులు అవినీతి రాజకీయాలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. చంద్రబాబు ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించి దొరికిపోయారని, కేసీఆర్ 12మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి టీఆర్ఎస్లో చేర్చుకున్నారని జీవన్ రెడ్డి తన  లేఖలో పేర్కొన్నారు. ఇద్దరు సీఎంలు తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నారని, ఇద్దరి రాజకీయ అవినీతి బయటపడాలంటే సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

 

మరిన్ని వార్తలు