'అమరుల త్యాగాలను కేసీఆర్ అవమానపరచడమే'

28 Oct, 2014 14:23 IST|Sakshi

హైదరాబాద్ :  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మంగళవారం లేఖ రాశారు. తెలంగాణ కోసం 2వేల మంది అమరులయ్యారంటూ అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్... ఇప్పుడు కేవలం 459 మంది అమరుల కుటుంబాలకు మాత్రమే ఆర్థిక సాయం ప్రకటించటం సరికాదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

 

ఈ చర్య ముమ్మాటికీ తెలంగాణ అమరుల త్యాగాలను అవమానపరచడమేనని, మిగిలిన అమరుల కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం ప్రకటించాలని షబ్బీర్ అలీ తన లేఖలో డిమాండ్ చేశారు. కాగా తెలంగాణ కోసం ప్రాణాత్యాగాలు చేసిన 459మంది అమరుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.పది లక్షల ఎక్స్గ్రేషియాను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

 

మరిన్ని వార్తలు