ఎన్టీఆర్ పేరు పెడతారా... దారుణం

21 Nov, 2014 10:58 IST|Sakshi
ఎన్టీఆర్ పేరు పెడతారా ... దారుణం

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఎన్టీఆర్ పేరు పెట్టడం దారుణమని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు డీఎస్, షబ్బీర్ అలీ ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్లో వారు మాట్లాడుతూ...  మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించి వ్యక్తి అని వారు గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి పేరును తొలగించడం అవమానకరమన్నారు. ఇలాంటి చర్యల ద్వారా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచేలా వ్యవహారిస్తుందని డీఎస్, షబ్బీర్ అలీ విమర్శించారు.

శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని డమెస్టిక్ టెర్మినల్కు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం ఎన్టీఆర్ పేరును ఖరారు చేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి పేరే ఆ టెర్మినల్ పెట్టాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తుండగా, రాజీవ్ గాంధీ  పేరే ఉంచాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది.

మరిన్ని వార్తలు