టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పండి: శ్రీధర్‌బాబు

3 Dec, 2018 14:08 IST|Sakshi
మాట్లాడుతున్న శ్రీధర్‌బాబు

కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీధర్‌బాబు

సాక్షి, మంథని: నాల్గున్నర సంవత్సరాలు మాయమాటలు చెప్పి కాలం వెల్లదీసిన టీఆర్‌ఎస్‌ నాయకులు మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని, వారికి గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్‌ అభ్యర్థి డి.శ్రీధర్‌బాబు అన్నారు. మంథని మండలం బిట్టుపల్లి, గద్దలపల్లి గ్రామాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కిసాన్‌ఖేత్‌ మజ్దూర్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి శశిభూషణ్‌ కాచే, మంథని జెడ్పీటీసీ సభ్యురాలు మూల సరోజన, మండల అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్, ఎంపీటీసీ అంబీరు సరోజన, నాయకులు బాపు, లింగాగౌడ్, గడ్డం రాజు, వంగరి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు