హైదరాబాద్: మెదక్ లోకసభకు జరిగే ఉప ఎన్నిక కోసం అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు కొనసాగిస్తోంది. అభ్యర్థి ఎంపికపై మెదక్ జిల్లా నేతలతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలతో అంతర్గతంగా చర్చలు జరుపుతున్నారు.
పార్టీలో ఎక్కువ మంది నాయకులు మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి వైపు మొగ్గు చూపుతుండటంతో ఆమెనే హైకమాండ్ ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది.
మంగళవారం రాత్రికల్లా మెదక్ లోకసభ అభ్యర్థి ఎంపికపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం నామినేషన్లో పాల్గొనాలని జిల్లా కాంగ్రెస్ నేతలకు పీసీసీ సమాచారమిచ్చినట్టు సమాచారం.