సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ అజ్ఞానంతోనే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీచేస్తున్నారని, అక్కడ ఆయనకు గుండుకొట్టి పంపడం ఖాయమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ ధ్వజమెత్తారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక శక్తులను ఏకం చేయా ల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు.