కాకా అంత్యక్రియలు పూర్తి

23 Dec, 2014 17:54 IST|Sakshi

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జి.వెంకటస్వామి (కాకా) అంత్యక్రియలు పంజాగుట్ట శ్మశాన వాటికలో పూర్తయ్యాయి.  పూర్తి అధికార లాంఛనాలతో కాకా అంత్యక్రియలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా పంజాగుట్ట శ్మశానవాటికకు చేరుకుని... వెంకటస్వామి మృతదేహానికి నివాళులర్పించారు.

రాహుల్ గాంధీ వెంట దిగ్విజయ్ సింగ్, జైపాల్రెడ్డి ఉన్నారు. అలాగే రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు, వ్యాపారవేత్తలతోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాకా అంత్యక్రియలకు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు