కాంగ్రెస్‌ గెలుపునకు కృషి

7 Nov, 2018 11:00 IST|Sakshi
మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నాయకులు

సాక్షి,పాన్‌గల్‌: కొల్లాపూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి విజయం కోసం కార్యకర్తలు ఐకమత్యంతో కృషి చేయాలని పార్టీ బీసీ సంఘం జిల్లా నాయకులు దేవేందర్‌నాయుడు, సుధాకర్‌యాదవ్, యుగంధర్‌గౌడు  అన్నారు. సోమవారం మండలంలోని రేమద్దుల, కిష్టాపూర్, దావాజిపల్లి, మాందాపూర్, కదిరెపాడు గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. అధిష్టానం కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఎవరికి కేటాయించినా విజయం ఖాయం అన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు కార్యకర్తలు వివరించాలన్నారు. దీంతో పాటు మండలం నుంచి పలువురు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరినట్లు ఆ పార్టీ నాయకులు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. తక్కువ సంఖ్యలో చేరిన వందల సంఖ్యలో చేరినట్లు చెప్పుకుంటున్నారన్నారు. సమావేశంలో మాజీ ఎంపీటీసీ బుచ్చారెడ్డి, ఆశోక్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు