కానిస్టేబుల్ సెలక్షన్స్‌లో అపశ్రుతి : యువతి మృతి

18 Feb, 2019 10:07 IST|Sakshi

సాక్షి, కరీంనగర్ : పోలీస్‌ ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కానిస్టేబుల్ సెలక్షన్స్‌లో భాగంగా రన్నింగ్ రేసులో పాల్గొన్న మమత అనే యువతి హార్ట్‌ బీట్‌ ఎక్కువై కిందపడిపోయి, మృతిచెందింది. మమత స్వస్థలం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల. తండ్రి సంపత్ ఆటో డ్రైవర్ కాగా, ముగ్గురు కూతుళ్లలో మమత పెద్దమ్మాయి. మమత మృతితో వెలిచాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. సీపీ కమలాసన్‌రెడ్డి మమత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వ పరంగా మమత కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు