కానిస్టేబుల్ బలవన్మరణం

27 Aug, 2015 20:25 IST|Sakshi

బాల్కొండ (నిజామాబాద్) : ఓ స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలో స్పెషల్ బ్రాంచ్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న విజయ్ కుమార్ అనే వ్యక్తి గురువారం బాల్కొండలోని నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు