కలెక్టరేట్లో మిస్ ఫైర్, కానిస్టేబుల్ మృతి

12 Jul, 2014 08:14 IST|Sakshi

మెదక్ : మెదక్ జిల్లా సంగారెడ్డి కలెక్టరేట్లో మిస్ ఫైర్ అయ్యింది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే కలెక్టరేట్ ట్రెజరీ కార్యాలయం వద్ద గార్డుగా విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ రమేష్ రెడ్డి చేతిలో తుపాకీ ప్రమాదవశాత్తూ పేలింది. దాంతో అతను అక్కడికక్కడే మరణించారు.

 

కాగా తుపాకీ పేలుడుపై అధికారులు విచారణకు ఆదేశించారు. తుపాకీ మిస్ ఫైర్ అయ్యిందా, లేక కానిస్టేబుల్ కావాలనే పేల్చుకున్నారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడు వైఎస్ఆర్ జిల్లా వాసి. సంఘటనా స్థలంఓ ఓ బులెట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు