సాక్షి, హైదరాబాద్:ఉన్నత విద్యా మండలి చైర్మన్గా టి.పాపిరెడ్డి పదవీ కాలాన్ని మూడేళ్లు పొడిగిస్తూ శుక్ర వారం ప్రభుత్వం జీవో జారీ చేసింది.స్తూ శుక్ర వారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారని పేర్కొంటూ విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య జీవో నంబర్ 17 జారీ చేశారు. ప్రస్తుతం చైర్మన్గా ఉన్న ఆయన పదవీ కాలం శుక్రవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అదేరోజు ఆయనను మరోదఫా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.