కరోనా : తెలంగాణలో మరో ఆరుగురు మృతి

1 Jun, 2020 21:04 IST|Sakshi

కొత్తగా 94 కరోనా కేసులు

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కొత్తగా 94 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, మరో ఆరుగురు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,792కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. మొత్తం కరోనా కేసుల్లో 432 మంది వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1491 మంది కరోనా నుంచి కోలుకోగా, 88 మంది మరణించారు. 1,213 మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. 

తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 79, రంగారెడ్డి జిల్లాలో 3, మహబూబాబాద్‌ జిల్లాలో 1, మేడ్చల్‌ జిల్లాలో 3, మెదక్‌ జిల్లాలో 2, పెద్దపల్లి జిల్లాలో 1, నల్గొండ జిల్లాలో 2, సంగారెడ్డి జిల్లాలో 2, జనగాం జిల్లాలో 1 ఉన్నాయి. 

మరిన్ని వార్తలు