సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 92 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,742కి చేరింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనాతో మరో ఐదుగురు మృతిచెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 142కి చేరింది.