తెలంగాణలో కొత్తగా 1,524 కరోనా కేసులు

14 Jul, 2020 22:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,524 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 37,745కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. నేడు కరోనాతో మరో పది మంది మృతిచెందడంతో మొత్తం మృతుల సంఖ్య 375కి చేరింది. తాజాగా కరోనా నుంచి కోలుకున్న  1,161 మంది డిశ్చార్జి కావడంతో.. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 24, 840కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,531 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 815 ఉన్నాయి.

జిల్లాల వారీగా కరోనా కేసులు.. 

మరిన్ని వార్తలు