జీహెచ్‌ఎంసీ మేయర్‌కు కరోనా పరీక్షలు

7 Jun, 2020 17:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు వైద్యులు కరోనా పరీక్ష నిర్వహించారు. పరీక్షల్లో నెగెటివ్‌గా తేలినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ప్రారంభోత్సవం సందర్భంగా నగరంలోని ఓ హోటల్ మేయర్ టీ తాగారు. అయితే అంతకుముందే ఆ టీ దుకాణంలో పనిచేసే మాస్టర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. విషయం తెలుసుకున్న అధికారులు.. వైద్యులకు సమాచారం ఇవ్వడంతో ముందస్తు జాగత్తగా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో నెగెటివ్‌గా రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా వైరస్‌ నియంత్రణకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో చేపట్టిన చర్యలను మేయర్‌ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు