తెలంగాణ: 129 కేసులు, ఏడు మరణాలు

3 Jun, 2020 21:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 129 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3020 కి చేరింది. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 108, రంగారెడ్డి, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో 6 చొప్పున, మేడ్చల్‌ 2, సిరిసిల్ల 2, యాదాద్రి, మహబూబ్‌ నగర్‌, కామారెడ్డి జిల్లాల్లో ఒకటి చొప్పున నమోదయ్యాయని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాస్‌రావు బుధవారం సాయంత్రం మీడియా బులెటిన్‌లో వెల్లడించారు. వలసదారుల్లో ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు. గడిచిన 24 గంటల్లో వైరస్‌ బాధితుల్లో ఏడుగురు మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 99కి చేరింది. తాజాగా మరో 92 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1556 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1365 యాక్టివ్‌ కేసులు
ఉన్నాయి.
(చదవండి: అన్‌లాక్‌ 1 : ఇక వారు ఇండియాకు రావొచ్చు)

మరిన్ని వార్తలు