తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

6 Jun, 2020 21:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా శనివారం ఒక్కరోజే 206 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 10 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 3,496కు చేరింది. ఇప్పటివరకు కరోనాతో 123 మంది మృతి చెందారు. తెలంగాణలో మొత్తం 1,710 మంది డిశ్చార్జ్‌ కాగా, ప్రస్తుతం 1,663 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

కొత్తగా వచ్చిన పాజిటివ్‌ కేసుల్లో 152 జీహెచ్‌ఎంసీలోనే నమోదయ్యాయి. మిగిలిన కేసుల్లో రంగారెడ్డిలో 10, మేడ్చల్‌లో 18, నిర్మల్‌లో 5, యాదాద్రిలో 5, మహబూబ్‌నగర్‌లో 4, మహబూబాబాద్‌లో 1, జగిత్యాలలో 2, వికారాబాద్‌లో 1, జనగామలో 1, నాగర్‌ కర్నూల్‌లో 2, గద్వాల్‌, నల్లగొండ, భద్రాద్రి, కరీంనగర్‌, మంచిర్యాలలో ఒక్కో కేసు నమోదైనట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
చదవండి: తెలంగాణలో టెన్త్‌ పరీక్షలు వాయిదా
చదవండి: 24 గంటల్లో 9887 కేసులు.. 294 మరణాలు

మరిన్ని వార్తలు