సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా గురువారం ఒక్కరోజే 209 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, తొమ్మిది మంది మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు 4,320కు చేరింది. మొత్తంగా 165 మంది ప్రాణాలు కోల్పోగా, 1,993 మంది కరోనా వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 2,162 యాక్టివ్ కేసులు ఉన్నాయి. (అందుబాటు ధరలో కరోనా టెస్టింగ్ కిట్)
కొత్తగా వచ్చిన కేసుల్లో 175 జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. మిగిలిన కేసుల్లో మేడ్చల్ జిల్లాలో 10, రంగారెడ్డిలో 7, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాల్లో 3, సిద్దిపేట, కొమురం భీం(ఆసిఫాబాద్), వరంగర్ అర్బన్ జిల్లాల్లో 2, ములుగు, కామారెడ్డి, వరంగల్(రూరల్), రాజన్న సిరిసిల్లా జిల్లాల్లో 1, ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చిన వారిలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. (డిశ్చార్జీల కంటే.. రెండింతల కేసులు)