తస్మాత్‌! అదుపు తప్పితే.. కుదుపే

27 Mar, 2020 08:32 IST|Sakshi
మోండా మార్కెట్‌లో కూరగాయలు కొనేందుకు మాస్క్‌తో బాలుడిని తీసుకొచ్చిన దృశ్యం

గ్రేటర్‌లో థర్డ్‌ కాంటాక్ట్‌ కలకలం

తాజాగా దోమలగూడ వైద్య దంపతులకు పాజిటివ్‌

ఉలిక్కి పడిన సిటిజన్లు.. వరుస కేసులతో భయాందోళన

చాపకింద నీరులా విస్తరించే అవకాశం ఉన్నట్లు సంకేతాలు

అప్రమత్తం కాకుంటే భారీ ముప్పు తప్పదంటున్న నిపుణులు

లాక్‌డౌన్‌ మాత్రమే సరిపోదు.. స్వీయనియంత్రణ తప్పనిసరి

లేదంటే ఏ రూపంలోనైనా కరోనా సోకే ప్రమాదం

నిత్యావసరాలంటూ ముప్పు తెచ్చుకోవద్దు

గుంపులు, గుంపులుగా వెళ్లకపోవడమే శ్రేయస్కరం

ఇప్పటి వరకు 45 కేసులు నమోదు  

వీటిలో 27 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే..

సాక్షి, సిటీబ్యూరో: కరోనా గ్రేటర్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోందనేందుకు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న పాజిటివ్‌ కేసులే నిదర్శనం. తెలంగాణలో ఇప్పటివరకు 45 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. వీటిలో 27 కేసులు హైదరాబాద్,రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోనే కావడం నగరవాసులను భయాందోళనకు గురి చేస్తోంది. విదేశాలకు వెళ్లివచ్చిన నేపథ్యం లేకపోయినప్పటికీ ఇద్దరు గృహిణులు, ఓ యువకుడు ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా దోమలగూడకు చెందిన వైద్య దంపతులకు సైతం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అలాగే శంషాబాద్‌లో డిప్యుటేషన్‌పై విధులు నిర్వర్తించే ఓ స్టాఫ్‌ నర్స్‌ కూడా కోవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నట్లు సమాచారం. స్వీయ నియంత్రణపై నిర్లక్ష్యం కారణంగానే థర్డ్‌ ఇంపాక్ట్‌ కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఎందరో కరోనా బారిన పడ్డారో తెలియని పరిస్థితి నగరవాసిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం రెండో దశ చివరి అంకంలో ఉంది. స్వీయనియంత్రణ లేకుంటే మాస్‌ క్యాజువాలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని ఎదుర్కొనేందుకు ప్రస్తుతం ఉన్న గాంధీని పూర్తిస్థాయి కరోనా ఆస్పత్రిగా మార్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది.  కాగా.. నగరంలో నిత్యావసర వస్తువులకు ఎటువంటి కొరత లేదని సీపీ అంజనీ కుమార్‌  స్పష్టం చేశారు.  –

అంటుకుందిలా..
1 సికింద్రాబాద్‌కు చెందిన వ్యాపారి (50) తన భార్యతో సహా ఈ నెల 14న దుబాయి మీదుగా హైదరాబాద్‌ చేరుకున్నారు. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆయన గాంధీలో చేరారు. 17న వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్‌ వచ్చింది. 21న ఆయన కుమారుడు (35)కి సైతం పాజిటివ్‌వచ్చింది. తండ్రి నుంచి కుమారుడికి,ఆ తర్వాత మరుసటి రోజుభార్యకు కరోనా పాజిటివ్‌నిర్ధారణ అయింది.

2 రంగారెడ్డి జిల్లా మణికొండకు చెందిన యువకుడు (34) మార్చి 14నస్వీడన్‌ నుంచి హైదరాబాద్‌కుచేరుకున్నాడు. ఈ నెల 22న ఆయనకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.ఇతని నుంచి ఆయన తల్లి (64)కివైరస్‌ సోకింది. 24న ఆమెకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. విదేశాలకువెళ్లి వచ్చిన దాఖలా కూడాఈమెకు లేదు.

3 రంగారెడ్డి జిల్లాకోకాపేటకు చెందిన వ్యక్తి (49) ఇటీవల లండన్‌ నుంచి సిటీకి చేరుకున్నాడు. కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో ఆయనకు ఈ నెల 24న  వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్‌ వచ్చింది. 25న ఆయన భార్య (43)కు పరీక్షలు చేయగా పాజిటివ్‌ వచ్చింది. నిజానికి ఆమె ఇతర దేశాలకు వెళ్లలేదు కానీ భర్త నుంచి ఆమెకు వైరస్‌ సోకినట్లు తేలింది.

4 తాజాగా గురువారం దోమలగూడకు చెందిన వైద్యదంపతులిద్దరికీ కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. నిజానికి వీరిద్దరూ విదేశాలకు వెళ్లి వచ్చిన నేపథ్యం లేదు. స్థానికంగా వేరే వ్యక్తుల నుంచి వీరికి  సోకినట్లు సమాచారం. వీరిద్దరూ సిటీలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు.దంపతులిద్దరూ ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించడం గమనార్హం.   

కరోనా కేసులు ఇలా..
77,045మార్చి 24 వరకువిదేశాల్లో పర్యటించిశంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న వారు
17,283వీరిలో దగ్గు, జలుబు,జ్వరం లక్షణాలు ఉన్నట్లు గుర్తించినవారు
856వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం సేకరించిన నమూనాలు
45వీటిలో ఇప్పటివరకు పాజిటివ్‌ కేసులు
699ఐసోలేషన్‌ వార్డులో చేరి,నెగిటివ్‌ రావడంతో ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయిన వారు
113 వ్యాధి నిర్ధారణపరీక్షల రిపోర్ట్‌ కోసం ఎదురు చూస్తున్నవారు
33 ప్రస్తుతంగాంధీలోని పాజిటివ్‌ కేసులు
10ఛాతీ ఆస్పత్రిలో ఉన్న పాజిటివ్‌ కేసులు
01చికిత్స అనంతరం కోలుకుని,డిశ్చార్జి అయినవారు.

మరిన్ని వార్తలు