మాస్కులపైనే మహమ్మారి జాగ్రత్తలు !

16 Apr, 2020 13:21 IST|Sakshi
మాస్క్‌పై ముద్రించిన సూచనలు

జనగామ, దేవరుప్పుల: మానవాళి మనుగడకే పెను ప్రమాదంగా మారిన కరోనా వైరస్‌ నుంచి కాపాడుకునేందుకు దాతలు మాస్క్‌లు పంపిణీ చేస్తున్నారు. ఇంతకాలం వివిధ రకాల మాస్క్‌లు పంపిణీ చేయగా... దేవరుప్పుల మండలం సీతారాంపురం సర్పంచ్‌ రెడ్డిరాజుల రమేష్‌ మరో అడుగు ముందుకేశారు. మాస్క్‌లపైనే కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముద్రించి గ్రామస్తులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి బుధవారం పంపిణీ చేశారు. ఈ మాస్క్‌లను ప్రతీ ఒక్కరూ ఆసక్తిగా పరిశీలించారు.

మరిన్ని వార్తలు