సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. నాల్గో తరగతి సిబ్బంది, క్లర్క్స్కు రోజు విడిచి రోజు డ్యూటీలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు తప్ప మిగతా స్టాఫ్లో 50 శాతం మాత్రమే పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. మిగతా 50 శాతం వారం తర్వాత పనిచేయాలని నిర్ధేశించింది. (చదవండి : నిర్మాత బండ్ల గణేష్కు కరోనా పాజిటివ్!)
ప్రభుత్వం విడుదల చేసిన కొత్త డ్యూటీ గైడ్లైన్స్