క్వారంటైన్‌లో యువకుడు ఆత్మహత్యాయత్నం

19 Apr, 2020 10:44 IST|Sakshi

సాక్షి, కుమురం భీం :  క్వారంటైన్‌లో ఉన్న యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. తాను ఉన్న వార్డులో ఒక వ్యక్తి కరోనా పాజిటివ్‌ రావడంతో భయపడిన యువకుడు.. తనను వేరే చోటికి తరలించాలని అధికారులను కోరాడు. అయితే అధికారులు సరిగా స్పందించకపోవడంతో ఆ యువకుడు వార్డులోనే ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అధికారులు, వైద్య సిబ్బంది అతన్ని అడ్డుకొని మరో చోటికి తరలించారు.
(చదవండి : తెలంగాణలో మరో 43 మందికి కరోనా)

కాగా, ఆసిఫాబాద్‌ జిల్లాలో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. జిల్లా వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఐదుకి చేరింది. తాజాగా ఆరేళ్ల బాలుడికి కూడా కరోనా పాటిజివ్‌ అని తేలింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 800 దాటింది. శనివారం రాత్రి నాటికి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య  809కి చేరిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటివరకు 186 మంది కోలుకుని డిశ్చార్చి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 605గా ఉండగా, మొత్తం 18మంది మృత్యువాతపడ్డారు.

మరిన్ని వార్తలు