జవహర్నగర్: జవహర్నగర్ కార్పోరేషన్ అధికారులు రోడ్డు పక్కన నాటిన మొక్కలను మేసిన మేకలకు ఫైన్ విధించారు. బుధవారం బాలాజీనగర్లోని శ్మశానవాటిక సమీపంతో పాటు గబ్బిలాలపేటలో నాటిన మొక్కలను కొన్ని మేకలు మేశాయి. దీంతో కార్పొరేషన్ సిబ్బంది వాటిని కార్పొరేషన్కు తీసుకువచ్చి రెండు వేల రూపాయల ఫైన్ వేసి మేకల యజమానులను హెచ్చరించి వదిలిపెట్టారు.