పత్తిరైతు ఆత్మహత్య

26 Oct, 2015 14:29 IST|Sakshi

అప్పుల బాధ తాళలేక పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదం ఆదిలాబాద్ జిల్లా లో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలం తేజాపూర్ గ్రామానికి చెందిన బద్దం కిష్టారెడ్డి(50)తనకున్న 12ఎకరాల భూమిలో పత్తి సాగు చేస్తున్నాడు.

ఈ క్రమంలో పెట్టుబడుల కోసం, బోర్లు వేయడం కోసం రూ. 9 లక్షలు అప్పు చేశాడు. దీంతో వాటిని తీర్చే దారి కానరాక తన పొలంలోనే  పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు