పత్తి రైతు ఆత్మహత్య

4 Jan, 2016 12:28 IST|Sakshi
రాయికల్: అప్పుల బాధ తాళలేక పత్తి రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా రాయికల్ మండలం మైథాపూర్‌లో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మల్లారెడ్డి (50) అనే రైతు పత్తి సాగు చేశాడు. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో.. అప్పు తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 
మరిన్ని వార్తలు