రేపటి నుంచి ‘గురుకుల’ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌

20 May, 2017 02:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:
తెలంగాణ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలకు ఆదివారం నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలంగాణ గురుకుల సొసైటీ కార్యదర్శి శేషుకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21న ఎంపీసీ విద్యార్థులకు, 23న బైపీసీ, ఎంఈసీ, సీఈసీ విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఉంటుందని పేర్కొన్నారు.

నాలుగు గురుకుల జూనియర్‌ కాలేజీల్లో 510 సీట్ల భర్తీకి 1:5 చొప్పున ఇంటర్వూ్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఇంటర్వూ్యకు ఎంపికైన వారి వివరాలను తమ వెబ్‌సైట్‌లో (tsrjdc.cgg.gov.in) విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ సహాయంతో పొందవచ్చని సూచించారు. బాలురకు సర్వేల్‌లోని గురుకుల జూనియర్‌ కాలేజీ, బాలికలకు హసన్‌పర్తిలోని గురుకుల జూనియర్‌ కాలేజీలో కౌన్సెలింగ్‌ ఉంటుందని వెల్లడించారు.

మరిన్ని వార్తలు