కుమార్తెతో పాటు దంపతుల ఆత్మహత్య

24 Nov, 2018 08:29 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కూర్మల్ గూడ గ్రామంలో కుటుంబ కలహాలతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరి వేసుకొని మృతి చెందారు. మృతులు వడ్డె హనుమంతు, చంద్రకళ, మంజుల(9)గా గుర్తించారు.  మృతుడు హనుమంతుకు ఇద్దరు భార్యలు ఉన్నట్టు సమాచారం.

ఇటీవల గొడవ జరగడంతో మొదటి భార్య ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ ఇంటినుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. భయంతోనే రెండో భార్య, కుమార్తెతో కలిసి హనుమంతు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు