కుటుంబ కలహాలు.. దంపతుల ఆత్మహత్య

23 Feb, 2018 11:31 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: జిల్లాలోని మధిర మండలం వంగవీడులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఖమ్మంలో ఓ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లోనే పురుగుల మందు తాగి తనువు చాలించారు. మృతులు వెంకటరామిరెడ్డి(55), పుల్లమ్మ(45) అని తెలుస్తోంది. కుటుంబ కలహాలే వారి మరణానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. 

>
మరిన్ని వార్తలు