వృద్ధ దంపతుల ఆత్మహత్య

9 Jun, 2016 11:17 IST|Sakshi

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామంలో గురువారం వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికంగా నివసిస్తున్న గుంటి మల్లయ్య (80), గుంటి రాజమ్మ(72) ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే వారి ఆత్మహత్యకు గల కారణాలు తెలియ లేదు.

ఆ విషయం గమనించిన కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.అనంతరం మృతదేహాలను కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి... కుటుంబ సభ్యుల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు