ఈఎస్‌ఐ స్కామ్‌ : నిందితులకు రెండురోజుల కస్టడీ

5 Oct, 2019 19:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఈఎస్‌ఐ నిధుల కుంభకోణం కేసులో డైరెక్టర్‌ దేవికారాణితో పాటు మరో ఆరుగురు నిందితులను రెండ్రోజుల కస్టడీకి అప్పగిస్తూ కోర్టు శనివారం తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలతో ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్న నిందితులను ఏసీబీ ఈ నెల 9, 10వ తేదీలలో తమ కస్టడీలోకి తీసుకోనుంది. మరోవైపు ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. లైఫ్‌కేర్‌ డ్రగ్స్‌ ఎండీ సుధాకర్‌రెడ్డిని ఏసీబీ శనివారం అరెస్ట్‌ చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన వారి సంఖ్య 9. కాగా ఏసీబీ మరికొంత మందిని అరెస్ట్‌ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.   

మరిన్ని వార్తలు