దయచేసి బ్యాంకులకు రావద్దు

19 Mar, 2020 03:29 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ విస్తరణ నేపథ్యంలో వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని నిరంతరాయంగా సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పలు బ్యాంకులు ప్రకటించాయి. బ్యాంకులకు రాకుండానే లావాదేవీలు నిర్వహించాలని వినియోగదారులకు సూచించారు. ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, యూపీఐ, బిల్లులను డిజిటల్‌ విధానంలో వినియోగదారులు చెల్లింపులు జరిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు బ్యాంకింగ్‌ వర్గాలు వెల్లడించాయి. లావాదేవీల కోసం యాప్‌లు వినియోగించడంతో పాటు, రిటైల్, కార్పొరేట్‌ బ్యాంకింగ్‌ సేవలు, కార్డుల ద్వారా ఇంటి నుంచే బ్యాంకింగ్‌ అవసరాలు తీర్చుకోవాలని బ్యాంకులు వినియోగదారులకు సూచించాయి.

మరిన్ని వార్తలు