‘ఆ పది మంది ఇండోనేషియన్లకు కరోనా’ 

20 Mar, 2020 21:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా పాజిటివ్‌ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం ఒక్క రోజే తెలంగాణలో మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు ఉదయం ఇద్దరిని కరోనా పాజిటివ్‌గా గుర్తించగా.. తాజాగా మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇటీవలే ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన 60 ఏళ్ల వృద్దుడికి కరోనా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నిర్దారణ అయింది. 

ఈ నెల 14న కరీంనగర్‌లో మతపరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇండోనేషియా నుంచి పది మంది సభ్యులు వచ్చిన విషయం తెలిసిందే. వచ్చిన వారిలో తొలుత ఏడుగురికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్టు గుర్తించగా.. తాజాగా మిగతా ముగ్గురికి కూడా కరోనా సోకినట్లు తేలింది. ప్రస్తుతం ఈ ఇండోనేషియా బృందాన్ని హైదరాబాద్‌లో ప్రత్యేక ఐసోలేషన్‌ సెంటర్‌లో చికిత్స అందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు