79 మంది కోవిడ్‌ అనుమానితులకు పరీక్షలు

28 Feb, 2020 03:00 IST|Sakshi

సాక్షి, గాంధీ ఆస్పత్రి: నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ఇప్పటి వరకు 79 మంది కోవిడ్‌ అనుమానితులకు వైద్యపరీక్షలు నిర్వహించామని నోడల్‌ అధికారి డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరంతో ఓ వ్యక్తి గురువారం ఆస్పత్రికి రాగా ఐసోలేషన్‌ వార్డులో చేర్చుకుని నమూనాలు సేకరించి కోవిడ్‌–19 నిర్ధారణ పరీక్ష కోసం గాంధీ వైరాలజీ ల్యాబ్‌కు పంపించామన్నారు. 78 మందికి కోవిడ్‌ నెగటివ్‌ వచ్చిందని, గురువారం చేరిన అనుమానితునికి సంబంధించిన నివేదిక శుక్రవారం అందుతుందన్నారు. 

మరిన్ని వార్తలు