ఎట్‌హోం ఆహ్వానాన్ని తిరస్కరించిన నారాయణ

22 Jan, 2018 17:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రిపబ్లిక్‌ డే సందర్భంగా  రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ‘ఎట్‌ హోం‌’  ఆహ్వానాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తిరస్కరించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వ్యక్తిగతంగా గవర్నర్‌పై గౌరవం ఉందని, అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు...వ్యవహరించిన తీరు సరిగా లేదని సీపీఐ నారాయణ పేర్కొన్నారు. అలాగే ఇక ముందు గవర్నర్‌ నిర్వహించే ఏ కార్యక్రమానికి తాను హాజరు కాబోనని ఆయన స్పష్టం చేశారు. ఎట్‌ హోంకు ఆహ్వానించినందుకు నారాయణ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

కాగా ప్రతి ఏడాది రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ‘ఎట్ హోం’ పేరిట తెనేటి విందు ఇవ్వడం ఆనవాయితీ. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేబినెట్ మంత్రులు, ప్రతిపక్ష నేతలతో పాటు ఇతర పార్టీ నేతలను గవర్నర్‌ ఆహ్వానిస్తుంటారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సందర్శన సందర్భంగా గవర్నర్‌ ...తెలంగాణ సీఎంతో పాటు భారీ నీటిపారుదల శాఖ మంత్రిని పొగడ్తలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. అయితే గవర్నర్‌ తీరుపై ప్రతిపక్షాలు కూడా అసంతృప్తి వ్యక్తం చేశాయి.

మరిన్ని వార్తలు