మైదానంలో క్రికెట్‌ ఆడుతూ.. కుప్పకూలాడు!

18 Nov, 2019 19:28 IST|Sakshi

సికింద్రాబాద్: నగరంలోని జీహెచ్‌ఎంసీ మైదానంలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్న ఓ ప్లేయర్ హఠాన్మారణం చెందాడు. హెచ్‌ఎస్‌బీసీలో ఉద్యోగం చేస్తున్న మహారాష్ట్రకు చెందిన వీరేంద్ర నాయక్.. సికింద్రాబాద్ మారేడ్‌పల్లి చెన్నై గ్రౌండ్‌లో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడాడు. ఓపెనర్‌గా బ్యాటింగ్ చేసిన వీరేంద్ర నాయక్ 55 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత గ్రౌండ్ నుండి విశ్రాంతి గది వైపు వెళ్తుండగా ఒక్కసారిగా కిందపడిపోయాడు. హుటాహుటిన అతన్ని స్థానిక ఆస్పత్రి తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరేంద్ర నాయక్‌ రెండు నెలలుగా గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడని పోలీసులు తెలిపారు. అప్పటివరకు తమతో కలిసి క్రికెట్‌ ఆడిన తమ స్నేహితుడు హఠాన్మరణం చెందడంతో వీరేంద్ర నాయక్‌ స్నేహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు