ఇకపై వానాకాలం, యాసంగి! 

25 Apr, 2020 19:22 IST|Sakshi

ఖరీఫ్, రబీ పేర్లు రద్దు  

సాక్షి, హైదరాబాద్‌ : ఖరీఫ్, రబీ పేర్లను వానాకాలం, యాసంగిగా మారుస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఈ ఆదేశాలు జారీచేసినట్లు ఆయన కార్యాలయం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. పంట సీజన్లలో ఖరీఫ్, రబీ పదాలు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వ్యవసాయ సీజన్లు ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శాఖాపరమైన ఉత్తర్వుల్లో వానాకాలం, యాసంగి అనే పేర్కొనాలని సూచించారు.   

మరిన్ని వార్తలు