ఏ తల్లి కన్నబిడ్డో..! 

2 Apr, 2018 11:41 IST|Sakshi
చెట్ల పొదల్లో పసికందు మృతదేహం

కళ్లు తెరవకముందే కానరాని లోకాలకు

ఎస్సారెస్పీ కాలువలో పసికందు మృతదేహం 

హుజూరాబాద్‌రూరల్‌ : ‘ఇంకా కళ్లు తెరవని ఆ పసికందు లోకా న్ని చూడకుండా నే పరలోకాలకు వెళ్లాడు. ఏ తల్లి కన్నబిడ్డో కెనా ల్‌కాలువలో విగతజీవిగా పడిఉన్నాడు. ఇంకా నెలలు కూడా నిండని ఆ పసికందు మృతదేహం కెనాల్‌కాలువలో కనబడిన తీరు స్థానికులను కలచివేసింది. మండలంలోని బోర్నపల్లి గ్రామంలోని ఎస్సారెస్పీ కాలువలో ఆదివారం అప్పుడే పుట్టిన ఓ పసికందు మృతదేహం లభ్యమైంది. గ్రామానికి చెందిన కొందరు యువకులు కాలువలో చేపలు పట్టడానికి వెళ్లేసరికి వారికి మగశిశువు మృతదేహం కనిపించింది. వెంటనే వారు గ్రామస్తులకు  సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు అక్కడికి చేరుకుని శిశువు మృతదేహం గురించి ఆరా తీస్తున్నారు.  

మరిన్ని వార్తలు