చిలుకూరు బాలాజీ సేవలో దళిత భక్తుడు

14 Aug, 2018 08:52 IST|Sakshi
మునివాహన సేవ పొందిన ఆదిత్య పరాశ్రీ, మాజీ మంత్రి పుష్పలీలతో అర్చకుడు రంగరాజన్‌  

మొయినాబాద్‌(చేవెళ్ల) : చిలుకూరు బాలాజీ దేవాల య అర్చకుడు రంగరాజన్‌ భుజస్కందాలపై కూర్చొని మునివాహన సేవతో ఆలయ ప్రవేశం పొం దిన దళిత భక్తుడు ఆదిత్య పరాశ్రీ సోమవారం చి లుకూరు బాలాజీని దర్శించుకున్నారు. ఏప్రిల్‌ 16 న ఆదిత్య పరాశ్రీని అర్చకుడు రంగరాజన్‌ తన భుజస్కందాలపై ఎత్తుకుని నగరంలోని జియాగూడ లో ఉన్న రంగనాథస్వామి ఆలయంలోకి మునివాహన సేవతో ఆలయ ప్రవేశం చేయించారు.

ఆ భక్తుడు మొదటి సారిగా సోమవారం చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని సందర్శించడంతో అర్చకుడు రంగరాజన్‌ ఆ భక్తుడిని గర్భగుడిలోకి తీసుకెళ్లి స్వామివారి దర్శనం చేయించారు. అదే విధంగా మాజీ మంత్రి కొండ్రు పుష్పలీల సోమవారం బాలాజీ స్వామిని దర్శించుకున్నారు. వీరితోపాటు టీయూఎఫ్‌ఫౌండర్‌ కుమారస్వామి స్వామివారిని దర్శించుకున్నారు.

మరిన్ని వార్తలు