నాన్నకు ‘నాట్య’ నివాళి

10 Nov, 2018 09:27 IST|Sakshi

తన తండ్రిపై ఉన్న ప్రేమను నాట్యం ద్వారాచూపించారామె. ఇటీవల మరణించిన న్యాయవాది వీఎల్‌ఎన్‌ గోపాలకృష్ణమూర్తి స్మృత్యర్థం ఆయన కూతురు సింధూర కూచిపూడి నాట్యంతో శుక్రవారం రాత్రి రవీంద్రభారతిలో నివాళులు అర్పించారు.

సాక్షి, సిటీబ్యూరో: లాస్యప్రియ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలో నిర్వహించిన సింధూరమూర్తి నాట్య ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. తన తండ్రి, హైకోర్టు సీనియర్‌ అడ్వొకేట్‌ వీఎల్‌ఎన్‌ గోపాలకృష్ణ మూర్తి ఇటీవల మరణించగా, ఆయనకు నివాళులు అర్పిస్తూ సింధూర ఈ ప్రదర్శన ఇచ్చింది. సింధూర దివంగత డాక్టర్‌ ఉమారామారావు శిష్యురాలు. కార్యక్రమంలో డాక్టర్‌ ఎం.జగన్నాథరావు, లాస్యప్రియ డైరెక్టర్‌ డాక్టర్‌ జ్వాలా శ్రీకళ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు